సన్యాసుల చేతిలో కర్ర ఎందుకు?
Filed under: తెలుసుకుందాం Author: జ్యోతిజీయర్ స్వాములు మరికొందరు స్వాముల చేతిలో పొడవాటి కర్రలు ఉంటాయి గమనించారా? ఎళ్లవేళలా అవి వారి చేతిలో ఉంటాయి. ఊతకోసమా అంటేకాదు. మరి వాటిని ఎప్పుడు చేత పట్టుకోవడానికి గల కారణం గురించి తెలుసుకుందాం. వైరాగ్యానికి, తాత్వికతకు, ద్వైత, అద్వైత భావానికి గుర్తుగా ఈ పొడవైన కర్ర పట్టుకుంటారు సన్యాసులు (యతులు).
ఈ కర్రలు వివిధ ఆకారాలలో ఉంటాయి. ప్రతీదానికి ఓ అర్ధం ఉంది. ' Y' ఆకారంగల యోగదండాన్ని, కమడలాన్ని పట్టుకొని ఉండేవారిని 'తాపసులు' లేదా 'ఋషులు' అని అంటారు. గాలి,నీరు, భూమి, అగ్ని, ఆకాశం అనే పంచభూతాల సమ్మేళనమే మనిషి కాబట్టి ఐదడుగుల కర్రను కూడా ధరిస్తారు. ఇందులో ఏకదండి, ద్విదండి, త్రిదండి అనే మూడు విధాలు ఉన్నాయి. ఒకే ఒక కర్రను ధరించి ఉండేవారు అద్వైత సిద్ధాంతాన్ని నమ్మేవారు, బోధించేవారు. అద్వైతం అనగా జీవుడు, దేవుడు ఒక్కటేననే సిద్ధాంతం (శ్రీ శంకరాచార్య మతం) మనిషిలోనే దేవుడిని చూడమని. స్వర్గం, నరకం రెండూ ఇక్కడే ఉన్నాయి. అంతరాత్మకు విరుద్ధంగా అక్రమ మార్గాన, అన్యాయంగా సంచరించినా, ప్రవర్తించినా ఆ పాపఫలితాన్ని ఏదో ఒక రూపంలో ఇక్కడే తప్పకుండా అనుభవించక తప్పదు. ఈ అద్వైత సిద్దాంతాన్ని బోధించేవారి చేతిలో జ్ఞానానికి సంకేతమైన రావిచెట్టునుండి సేకరించిన ఒకే కర్ర ఉంటుంది.
రెండు కర్రలు కలిపి ఒక్కటిగాకట్టి ధరించి బోధనలు చేసేవారు ద్వైత సిద్ధాంతం కలవారు. వీరిని 'ద్విదండి ' స్వాములు అంటారు. వీరు జీవుడు, దేవుడు వేర్వేరు (రామానుజాచార్యుల మతం) అని బోధిస్తారు ద్వైత సిద్ధాంతానికి ఉన్న ప్రాచుర్యం అద్వైతానికి లేదు. ఈ మతానికి చెందినవారిని 'జీయరు'లని అంటారు.
మూడు కర్రలను ఒకే కట్టగా కట్టి భుజాన పెట్టుకునేవారు కూడా ఉన్నారు. వాళ్లు జీవాత్మ, పరమాత్మ, ప్రకృతి ఒకటే అనే నారాయణ తత్వాన్ని బోధిస్తూ ఉంతారు. పొడవైన ఈ దండాలతో దుష్టప్రాణులనుండి రక్షణ కొరకు, ఫలఫుష్పాల సేకరణ చేసుకుంటూ భగవధ్యానం చేసుకుంటారు.
ఋషుల చేతిలో ఉండే 18 అంగులాల యోగదండం జపం చేయదానికి, ఆత్మరక్షణకు ఉపయోగపడుతుంది. యోగులు రుద్రాక్షమాల నేలపైబడకుండా 'Y' ఆకారంలో ఉన్న యోగదండంపై చేతినిపెట్టి జపమాల తిప్పుతుంటారు..
Dr.Tekumalla Venkatappaiah
August 26, 2010 at 4:22 PM
బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్
August 26, 2010 at 7:57 PM
Narayana
August 26, 2010 at 9:24 PM
అయితే మీరన్నట్లు ద్విదండం కాకుండా చిన శ్రీమన్నారాయణ 'జియ్యరు' వారి చేతిలో త్రిదండాలున్నై! వారు రామానుజ సిద్ధాంతానుయాయులని ఇన్నాళ్ళూ నేను అనుకునేవాడిని. కారన్నమాట!
రామానుజమతం వారికి అద్వైతులకంటే ఎక్కువ ఆదరణ ఉందన్న సూచన, గాలిలో విసిరిన బాణం కాదు గద? మీ సూచనకు కొలమానాలు?
SIVARAMA
August 26, 2010 at 10:17 PM
కాంత్
August 26, 2010 at 10:28 PM
పానీపూరి123
August 26, 2010 at 10:39 PM
Unknown
August 26, 2010 at 10:56 PM
Unknown
August 26, 2010 at 11:46 PM
Apparao
August 27, 2010 at 8:10 AM
భగవాన్ శ్రీ షిరిడి సాయిబాబా వారి శక్తిని ఇటుక రాయిలో నిక్షిప్తం చేసారు
దేవాలయాలలో విగ్రాహాలకి ప్రాణ ప్రతిష్ట చేసినట్లు, వీరు తమ ఆధ్యాత్మక శక్తిని యోగ దండాలలో ఉంచుతారు
ఎట్టిపరిస్తితులలోనూ వీటిని నేలకు తాకనివ్వరు
Apparao
August 28, 2010 at 6:37 AM
Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్)
August 30, 2010 at 2:50 PM
వాజసనేయ
August 30, 2010 at 4:10 PM
భాస్కర రామిరెడ్డి
September 12, 2010 at 8:53 AM
హారం
pulsar
February 19, 2013 at 6:45 PM
కొంత విషయసేకరణ పెద్దల ద్వారా కూడ నిరూపించుకుని వ్రాయగలరు. మీ మంచి ప్రయత్నానికి అభినందనలు.