పురాణ విజ్ఞానం - 1
Filed under: పురాణ విజ్ఞానం Author: జ్యోతి
సందేహాలకు శ్రీ మల్లాది చంద్రశేఖరశాస్త్రిగారి సమాధానాలు..
1. వాల్మీకి రామాయణంలో 'పుంసాం మోహన రూపాయ ' పురుషులను రాముడు మోహింపచేసినట్లు,
ఋషులు కూడా మోహించినట్లున్నదా? మరి స్త్రీలను కూడా స్త్రీలు మోహించేటట్లున్న స్త్రీ ఉన్నదా?
జ. 'పుంసాం మోహనరూపాయ ' అనే మాటకు శ్రీరాముడు పరబ్రహ్మం అని, ప్రైష్టం, శ్రేష్టము అయినది
పరబ్రహ్మస్వరూపమని, సర్వాకర్షకం అని కాని, ఈ స్త్రీపురుష భేధం పరబ్రహ్మయందు సర్వమూ
ఆకర్షించబడుతుంది అని కాని ఇది అందాలపోటీ కాదు.
2. పుత్రసంతానం లేనివారు (దౌహితులు కూడా లేనివారు) స్వయంగా జీవితకాలంలో చేసుకునే శ్రాద్ధ
ప్రక్రియ వుందా? ఎవ్వరూ లేనివారి గతి ఏమిటి?
జ. తనకు తానుగా మరణించకముందు కర్మకాండలు చేసుకునే విధానం లేదు. పుత్రులు లేని
శ్రీశుకునకున్ వాటిల్లెనే దుర్గతులు అన్నాడు ధూర్జటి. కనుక సత్పాత్రములలో భవత్ప్రీతిగా దానం
చేయడం, క్షేత్రదర్శనం, పరసహాయం చేయడం భవిష్యత్తులో సర్వశ్రేయస్సులను కలిగిస్తుంది.
3. వయస్సులో పెద్దవారైనప్పటికీ అల్లుడు మామగారి కాళ్ళకు నమస్కారం చేయకూడదు అంటారు.
పెళ్ళిలో మాత్రం మామగారు అల్లుడి కాళ్ళు కడిగి ఆ నీళ్ళు తలపై చల్లుకుంటాడు. ఎవరైనా మన
కాళ్ళను త్రాకి నమస్కారం చేస్తే వారి పాపాలు మనకు అంటుతాయి అంటారు. నిజమేనా?
జ వివాహ సమయములో మామగారు అల్లుడి కాళ్లు కడిగి నీళ్లు తన తలపై చల్లుకుంటాడు.ఎందుకంటే
కన్యాదాన సమయంలో అల్లుడిని నారాయణుడిగా భావించడంవల్ల. కాని ఇతరత్రా ఏ సన్నివేశంలో
నయినా అల్లుండే మామగారికి నమస్కారం చేయాలి. ఎదుటివారు నమస్కారం చేసినప్ప్పుడు మన
పుణ్యం ఖర్చు అవుతుంది. నమస్కరించినప్పుడు చిన్నవారైతే ఆశీర్వాదం ఇవ్వాలి. పెద్దవారికి
ప్రతినమస్కారం చేయాలి.
1. వాల్మీకి రామాయణంలో 'పుంసాం మోహన రూపాయ ' పురుషులను రాముడు మోహింపచేసినట్లు,
ఋషులు కూడా మోహించినట్లున్నదా? మరి స్త్రీలను కూడా స్త్రీలు మోహించేటట్లున్న స్త్రీ ఉన్నదా?
జ. 'పుంసాం మోహనరూపాయ ' అనే మాటకు శ్రీరాముడు పరబ్రహ్మం అని, ప్రైష్టం, శ్రేష్టము అయినది
పరబ్రహ్మస్వరూపమని, సర్వాకర్షకం అని కాని, ఈ స్త్రీపురుష భేధం పరబ్రహ్మయందు సర్వమూ
ఆకర్షించబడుతుంది అని కాని ఇది అందాలపోటీ కాదు.
2. పుత్రసంతానం లేనివారు (దౌహితులు కూడా లేనివారు) స్వయంగా జీవితకాలంలో చేసుకునే శ్రాద్ధ
ప్రక్రియ వుందా? ఎవ్వరూ లేనివారి గతి ఏమిటి?
జ. తనకు తానుగా మరణించకముందు కర్మకాండలు చేసుకునే విధానం లేదు. పుత్రులు లేని
శ్రీశుకునకున్ వాటిల్లెనే దుర్గతులు అన్నాడు ధూర్జటి. కనుక సత్పాత్రములలో భవత్ప్రీతిగా దానం
చేయడం, క్షేత్రదర్శనం, పరసహాయం చేయడం భవిష్యత్తులో సర్వశ్రేయస్సులను కలిగిస్తుంది.
3. వయస్సులో పెద్దవారైనప్పటికీ అల్లుడు మామగారి కాళ్ళకు నమస్కారం చేయకూడదు అంటారు.
పెళ్ళిలో మాత్రం మామగారు అల్లుడి కాళ్ళు కడిగి ఆ నీళ్ళు తలపై చల్లుకుంటాడు. ఎవరైనా మన
కాళ్ళను త్రాకి నమస్కారం చేస్తే వారి పాపాలు మనకు అంటుతాయి అంటారు. నిజమేనా?
జ వివాహ సమయములో మామగారు అల్లుడి కాళ్లు కడిగి నీళ్లు తన తలపై చల్లుకుంటాడు.ఎందుకంటే
కన్యాదాన సమయంలో అల్లుడిని నారాయణుడిగా భావించడంవల్ల. కాని ఇతరత్రా ఏ సన్నివేశంలో
నయినా అల్లుండే మామగారికి నమస్కారం చేయాలి. ఎదుటివారు నమస్కారం చేసినప్ప్పుడు మన
పుణ్యం ఖర్చు అవుతుంది. నమస్కరించినప్పుడు చిన్నవారైతే ఆశీర్వాదం ఇవ్వాలి. పెద్దవారికి
ప్రతినమస్కారం చేయాలి.
Anonymous
April 20, 2007 at 4:00 PM
spandana
April 21, 2007 at 1:19 AM
"పుంసాం మోహన రూపాయ" -- ఇక్కడేమొ రాముడు పరబ్రహ్మ అదీ అంటారు. ఇంకోచోట ఆ సందర్భానికి తగినట్లు ఆయనది మానవరూపం అంటారు. మన కత్తికి రెండువైపులా పదునే అయినప్పుడు ఈ సమాధానాలు వింటే ఎంత వినక పోతే ఎంత!
నేనూ ఇలాంటి శిర్షిక నిర్వహించాలని కొద్ది రోజుల క్రితమే బుద్ది పుట్టింది. త్వరలో ఒక పోస్టైనా చేస్తాను.
--ప్రసాద్
http://blog.charasala.com
rākeśvara
April 21, 2007 at 8:40 AM
మా అక్క పెళ్ళిలో
నేను : "పెద్దోళ్ళు చిన్నవాళ్ళ కాళ్ళు కడగడమేమిటి చిరాకుగా" అంటే,
అమ్మమ్మ: "పెళ్ళి సమయంలో పెళ్ళి కొడుకు విష్ణుమూర్తితో సమానం రా.." అంది.
నేను : "మరి పెళ్ళి కూతురు లక్షీ దేవి కదా, ఆమె కాళ్ళు కడగర?" అని అనడం గుర్తు. :)
ఏది ఏమైనా.. మొదటి ప్రశ్న సమాధానం బా ఇచ్చారు. ఈ కాలపు ఇంజనీర్లకు symbolism ఎలా తీసుకోవాలో తెలియట్లేదు.
రాధిక
April 21, 2007 at 10:19 PM
Anonymous
October 30, 2007 at 10:39 AM
naaku oka chinna samdEham nivRtti ekkaDa chEsukOvAlO teliyaka satamata mavutunnAnu.
vaitariNi anTE evaru aame nadigaa enduku mArindi? adi SApamA lEka varamA nAku teliya chEyaDi please.
Gurubabu
June 5, 2010 at 9:22 AM